అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేశ్ పేరుని చేర్చిన సీఐడీ

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నారా లోకేశ్‌ పేరుని సీఐడీ అధికారులు చేర్చారు.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2023 8:14 AM GMT
Nara lokesh, amaravati inner ring road Case, AP CID,

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేశ్ పేరుని చేర్చిన సీఐడీ

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేరుని సీఐడీ అధికారులు చేర్చారు. ఈ మేరకు కేసులో ఆయన పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టు సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేశ్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని ఏసీ సీఐడీ అభియోగులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెమోలో నారా లోకేశ్ పేరుని ఏ14లో మెన్షన్ చేసింది. సీఐడీ మెమోపై న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లను సీఐడీ చేర్చింది. నారాయణ ముందస్తు బెయిల్‌ పొందారు. ఈ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

ఇక ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబుని కూడా సీఐడీ అధికారులు నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నారా లోకేశ్ ఢిల్లీలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబుని బెయిల్‌పై బయటకు రప్పించేందుకు న్యాయవాదులతో మాట్లాడుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అమరావతి ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేశ్ పేరుని చేర్చడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో నారా లోకేశ్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు బనాయిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

Next Story