ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. వారికి టన్నుకి రూ.30వేలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By Srikanth Gundamalla
Published on : 17 Jun 2024 6:33 AM IST

mango farmers, Chittoor, Andhra Pradesh, cm Chandrababu,

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. వారికి టన్నుకి రూ.30వేలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుపై ఆదేశాలు జారీ చేశారు. తాజాగా రైతులకు అండగా నిలబడ్డారు సీఎం చంద్రబాబు. మామిడి రైతుల సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన సానుకూలంగా స్పందించి.. ఆరి సమస్యకు పరిష్కారం చూపించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి ధరలు భారీగా తగ్గిపోయాయి. దాంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లారు మామిడి రైతులు. ఆయన కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మామిడి రైతులకు మంచి ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం చంద్రబాబుకి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కలెక్టర్లు కీలక ఆదేశాలు ఇచ్చారు. తోతాపురి మామిడి టన్నుకి రూ.30వేలను ఫిక్స్ చేశారు. ఈ మేరకు రైతులకు ఈ ధరనే చెల్లించాలని పల్ప్‌ ఫ్యాక్టరీలను ఆదేశించారు. ఈ ధర కన్నా తక్కువ డబ్బులు చెల్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సీఎం చంద్రబాబు నిర్ణయంతో మామిడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మామిడి రైతులకు క్వింటాకు రూ.30వేలు పెంచిన విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. మామిడి రైతులకు ఉరట లభించిదన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గుజ్జు పరిశ్రమల యజమానులు, మామిడి ర్యాంపు యజమానులు, మామిడి కాయల మండీల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. టన్నుకు 30 వేలకు తగ్గుకుండా ధర రైతులకు చెల్లించేలా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారని తెలిపారు. దీంతో మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పులివర్తి చెప్పారు.

Next Story