నారా లోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
By Srikanth Gundamalla
నారా లోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెడ్బుక్ అంశంపై నోటీసులు ఇచ్చారు. రెడ్బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో లోకేశ్కు నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించింది. దాంతో.. గురువారం సీఐడీ అధికారులు లోకేశ్ ఇంటికి వెళ్లారు. అక్కడ సీఐడీ నోటీసులను తీసుకోవడానికి లోకేశ్ నిరాకరించారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు లోకేశ్కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. సీఐడీ నోటీసులను అందుకున్నట్లు లోకేశ్ కూడా ధృవీకరించారు.
లోకేశ్ అరెస్ట్కు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్బుక్లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పేర్కొన్నారు. దీన్ని సీఐడీ అధికారులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు.