'అల వైకుంఠపురంలో..' వినూత్న మ్యూజికల్ ఫెస్టివల్.!
By Newsmeter.Network Published on 30 Dec 2019 6:35 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ....'అల వైకుంఠపురంలో' సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ కెరీర్ లో మరో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ గా నిలిచింది ఈ చిత్రం. అందుకు ముఖ్యంగా తమన్ కు కృతఙ్ఞతలు. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని, 2020 జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ''అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను '' వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నట్లు తెలిపారు.