ఈతకు వెళ్లి 8 మంది విద్యార్థులు మృతి

By సుభాష్  Published on  22 Jun 2020 8:57 AM GMT
ఈతకు వెళ్లి 8 మంది విద్యార్థులు మృతి

చైనాలో విషాదం చోటు చేసుకుంది. నదిలో మునిగి 8 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ చైనా టోంగ్‌జియా ప్రాంతంలో చోటు చేసుకుంది. సరదాగా నదిలో ఈతకొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలోమునిగి మృతి చెందారు.

చైనాలోని చోంగ్‌ కింగ్‌ నగరం లో ఓ నదిలో ఈతకొట్టేందుకు 8 మంది విద్యార్థులు వెళ్లారు. అయితే అందులో ఓ విద్యార్థి ఈత కొడుతూ మునిగిపోతుండగా, అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ఏడుగురు విద్యార్థులు సైతం నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు, సహాయక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు.

Next Story