1638 కిలోల గంజాయి పట్టివేత.. అరటి గెలల్లో తరలిస్తూ..

By సుభాష్  Published on  27 Feb 2020 2:58 PM GMT
1638 కిలోల గంజాయి పట్టివేత.. అరటి గెలల్లో తరలిస్తూ..

విశాఖలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 1638 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు.. పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటలిజెన్స్‌ కు అందిన సమాచారం ప్రకారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. మొత్తం 40 సంచుల్లో 800 బ్రౌన్‌ ప్యాకెట్లలో గంజాయిని తరలిస్తుంగా పట్టుకున్నారు.

కాగా, వాహనాల్లో అరటి గెలలలో దాచి ఈ గంజాయిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గంజాయిని విశాఖ నుంచి భువనేశ్వర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిపై 11985 చట్టం ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయి విలువ 2.45 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు రెండు వాహనాలను సీజ్‌ చేశారు.

Next Story