తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరిగిన‌ క‌రోనా కేసులు.. ఒక్క‌రోజే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2020 3:39 PM GMT
తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరిగిన‌ క‌రోనా కేసులు.. ఒక్క‌రోజే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల నమోదు చూస్తుంటే గుండెల్ల దడపుట్టుకొస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 143 కేసులు న‌మోదైనట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ లో తెలిపింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3290 కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా ఎనిమిది మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 113కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 1627మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 1550మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో నేడు ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 116 కేసులుండటం గ‌మ‌నార్హం.

గతంలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇటీవల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే ముందు ఇతర జిల్లాల్లో కూడా కరోనా తీవ్రంగా ఉన్నా కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో తప్ప ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే గత నాలుగైదు రోజుల నుంచి మళ్లీ ఇతర జిల్లాల్లో కూడా కరోనా కేసులు నమోదు కావడంపై రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్ని మరింత కలవరపెడుతోంది.

కొత్త కేసులు - 143

కొత్తగా మరణాలు -8

ఇప్పటి వరకూ మృతులు – 113

మొత్తం కేసులు – 3290

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త కేసులు – 116

రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య – 1550

Ts1

Next Story