తెలంగాణలో కొత్తగా 1,273 కేసులు

By సుభాష్  Published on  24 Oct 2020 4:39 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,273 కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,273 మంది పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకకు 2,30,274 పాజిటవ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 1,303 మంది మృతి చెందారు.

తాజాగా కరోనా నుంచి 1,708 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,09,034కు చేరింది. రాష్ట్రంలో 19,937 కేసులు యాక్టివ్‌లో ఉండగా, హోం ఐసోలేషన్లో 16,809 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 227 కేసులు నమోదయ్యాయి.

Next Story