తెలంగాణలో కొత్తగా 1,421 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  23 Oct 2020 3:53 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,421 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,421 మందికి పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో2,29,001 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తాజాగా కరోనాతో ఆరుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,221కి చేరింది. కాగా, ఇప్పటి వరకు కరోనాతో 2,07,326 మంది కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 20,337 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక హోం ఐసోలేషన్‌లో 17,214 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 249 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story