రోడ్డుకు అడ్డంగా పులి.. భ‌యాందోళ‌న‌కు గురైన భ‌క్తులు

By Newsmeter.Network  Published on  13 Jan 2020 5:40 AM GMT
రోడ్డుకు అడ్డంగా పులి.. భ‌యాందోళ‌న‌కు గురైన భ‌క్తులు

శ్రీశైలం : పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి సమీపంలోని ఘాట్ రోడ్డుపై పలి కనిపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘాట్ రోడ్డుపై పులి క‌నిపించ‌డంతో ఎక్క‌డి వాహానాలు అక్క‌డే నిలిపి వేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. శ్రీశైలం దేవస్థానానికి 10 కిలో మీటర్ల దూరంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో చిన్నారుట్ల వద్ద పులి సంచ‌రించింది. రోడ్డుపై పులి క‌నిపించ‌డంతో భ‌క్తులు ఎక్క‌డి వాహానాల‌ను అక్క‌డే నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా భక్తుల వాహనాలు వెళ్లకుండా 20 నిమిషాలు పులి అక్క‌డే ఉండిపోయింది. దీంతో భ‌క్తులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. వెంట‌నే ఫారెస్టు అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు సంఘటనా స్థలానికి వచ్చే సమయానికి పులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది.

Next Story