ఆ మూడు చోట్ల రీపోలింగ్..

By Newsmeter.Network  Published on  23 Jan 2020 12:25 PM GMT
ఆ మూడు చోట్ల రీపోలింగ్..

రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాల్టీలకు నిన్న ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. టెండర్ ఓటు కారణంగా మూడు చోట్ల రీపోలింగ్ చేప‌ట్ట‌నున్న‌ట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. బోధ‌న్ మున్సిపాలిటీ 32వ వార్డు 87వ పోలింగ్ స్టేష‌న్ లో, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ 41వార్డు 198 పోలింగ్ స్టేష‌న్ లో, కామారెడ్డి మున్సిపాలిటీ 41వార్డు 101 పోలింగ్ స్టేష‌న్ లో రీపోలింగ్ జ‌ర‌గ‌నుంది. రేపు ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కు ఏర్పాట్లు చేశారు.

Next Story