టీ20 వరల్డ్కప్ : సెమీఫైనల్లో భారత్ మహిళల జట్టుతో తలపడేది ఎవరంటే..?
By Newsmeter.Network Published on 3 March 2020 12:03 PM GMTమెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు అందరి కంటే ముందుగా సెమీఫైనల్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. మార్చి 5 తేదిన గురువారం సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా భారత్తో సెమీఫైనల్లో తలపడే ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. భారత్ మహిళల జట్టుతో తలపడేది ఎవరో కాదు.. ఇంగ్లాండ్ మహిళల జట్టు. గురువారం జరిగే సెమీస్లో ఇంగ్లండ్తో భారత అమ్మాయిలు అమీతుమీ తేల్చుకోనున్నారు.
గ్రూప్- బిలో భాగంగా మంగళవారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించి ఏడు పాయింట్లతో సౌతాఫ్రికా గ్రూప్-బిలో టాపర్గా నిలిచింది. మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లు సాధించి ఇంగ్లండ్ రెండో ప్లేస్లో నిలించింది. దాంతో.. గ్రూప్-ఎలో నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్తో ఇంగ్లండ్ సెమీస్లో తలపడనుంది. గ్రూప్-ఎలో సెకండ్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియాతో గ్రూప్-బి టాపర్ సౌతాఫ్రికా తలడపనుంది. ఈ రెండు మ్యాచ్లు సిడ్నీలో గురువారం జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కు ఇంగ్లండ్, భారత్ మధ్య తొలి సెమీస్ ఉంటుంది. మధ్యాహ్నం 1.30కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి.