భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. కరోనా ఎఫెక్టేనా..?
By సుభాష్ Published on 28 Feb 2020 6:37 AM GMTదేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. చైనాలో మొదలైన కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు నెలకొడంతో కీలక రంగాల షేర్లు కుదేలవుతున్నాయి. ఈ రోజు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 1100 పాయింట్ల నష్టంతో 38,635 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. అంతేకాకుండా నిప్టీ కూడా 280 పాయింట్లు కోల్పోయి 11,319 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. కరోనా భయంతో అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. అలాగే ఐటీ, మెటల్, రియల్ ఎస్టేట్ సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. స్టాక్ మార్కెట్లపై కూడా కరోనా ఎఫెక్ట్ ప్రభావం భారీగానే చూపుతోంది.
Next Story