ఆర్సీబీ కొత్త 'లోగో'ని చూశారా..
By Newsmeter.Network Published on 14 Feb 2020 9:07 AM GMTజట్టులో పేరున్న సార్లు ఉన్నారు.. ఒంటి చేత్తో విజయాలు అందించగల హిట్టర్లు ఉన్నారు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 12సీజన్లు ముగిసిన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ప్రతీ సారి కప్పు మనదే అంటూ అభిమానులు ఆశపడుతున్న.. ఇప్పటి వరకు అది అందని ద్రాక్ష మాదిరిగానే మిగిలింది. 2019 సీజన్లో వరుస పరాజయాల్ని చవిచూసిన ఆ జట్టు.. కనీసం ప్లేఆఫ్కి కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్లోనైనా సత్తాచాటాలని ఆర్సీబీ ఆశిస్తోంది.
అందుకే.. ఢిల్లీ డేర్డెవిల్స్ బాటలో నడవాలని బావిస్తోంది. గత సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు తమ టీమ్ పేరుని ఢిల్లీ క్యాపిటల్స్గా మార్చుకుని.. సరికొత్త లొగోతో బరిలోకి దిగింది. దీంతో.. గత ఐదారు సీజన్లుగా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాల్లో కనిపించిన ఆ జట్టు.. 2019 ఐపీఎల్ సీజన్లో మాత్రం కొన్ని రోజులు టేబుల్ టాపర్గా నిలిచింది. ప్లేఆఫ్లో చెన్నై చేతిలో ఓడిన ఢిల్లీ.. టైటిల్కి అడుగు దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు ప్రదర్శన అభిమానులకు ఆకట్టుకుంది.
ఇప్పుడు అదే బాటలో ఆర్సీబీ నడుస్తోంది. ఐపీఎల్-2020 సీజన్కు సరికొత్త లోగో తో బరిలోకి దిగనుంది. కొత్త దశాబ్దం.. కొత్త లొగోతో ఐపీఎల్లో బరిలోకి దిగబోతున్నట్లు ఈరోజు ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు టీమ్ సోషల్ మీడియా అకౌంట్స్లోనూ ప్రొఫైల్ ఫొటోల్ని మార్చింది.
ఇటీవల టీమ్ ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ నుంచి ఫొటోల్ని తొలగించడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, చాహల్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్కి జట్టులోనూ అనూహ్య మార్పులు చేసిన ఆర్సీబీ.. వేలంలో అరోన్ ఫించ్, క్రిస్ మోరీస్, కేన్ రిచర్డ్సన్, డేల్ స్టెయిన్ తదితరుల్ని కొనుగోలు చేసి బలంగా కనిపిస్తోంది.