'మోతేరా' స్టేడియం ఏరియల్‌ వ్యూ చూశారా..

By Newsmeter.Network  Published on  19 Feb 2020 1:42 PM GMT
మోతేరా స్టేడియం ఏరియల్‌ వ్యూ చూశారా..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దాదాపుగా పూర్తి అయ్యింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం కన్నా మోతేరా స్టేడియం చాలా పెద్దది. తాజాగా ఈ స్టేడియం ఏరియల్‌ వ్యూని బీసీసీఐ(భారత క్రికెట్‌ కంటోల్‌ బోర్డ్) తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఒకే సారి లక్షా పదివేల మంది మ్యాచ్‌ వీక్షించవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో ప్రధాని మోడీతో కలిసి ఈ స్టేడియాన్ని విజిట్ చేస్తున్న సందర్భంగా.. దీన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతునారు. ట్రంప్ రాక నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బీసీసీఐ ఈ ఫోటోను ట్వీట్ చేయడంతో క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దే లేదు.

కాగా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో తొలి మ్యాచ్‌ జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌కు ఈ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇక ఈ స్టేడియానికి ప్రత్యేకమైన వరల్డ్ క్లాస్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కేవలం అరగంటలోనే వర్షపు నీటిని బయటకు పంపే కొత్త తరహా సబ్ సర్ఫేస్ డ్రైన్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో వర్షం పడినా మ్యాచ్‌ రద్దు కాదు.



Next Story