పసుపులేటి కుటుంబానికి రెండు లక్షల ఆర్ధిక సాయం !  

By Newsmeter.Network  Published on  13 Feb 2020 11:38 AM GMT
పసుపులేటి కుటుంబానికి రెండు లక్షల ఆర్ధిక సాయం !  

సీనియర్ సినీ పాత్రికేయులు పసుపులేటి రామారావుగారు అనారోగ్యంతో బుధవారం స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఆయన మృతికి మీడియా లోకంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి ఆప్తుడైన పసుపులేటి రామారావుగారి భౌతిక కాయాన్ని మెగాస్టార్ పూలమాల ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సభ్యులు శ్రీ పసుపులేటి రామారావు గారి సంతాప సభలో రెండు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అలాగే నిన్న సాయత్రం 6 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో సంతాప సభ జరుగుతుంది. ఆ అవిశ్రాంత పాత్రికేయ దిగ్గజానికి నివాళులు అర్పించేందుకు మీడియా విభాగానికి చెందినవారితో పాటు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి రామారావుగారి భార్య వెంకటలక్ష్మి, కుమారుడు కళ్యాణ్ నాగ పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.

ఇక రామారావు మృతికి సంతాపం తెలుపుతూ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్, నాగచైతన్య, పూరి జగన్నాద్, హీరో గోపీచంద్, సాయి శ్రీనివాస్ అలాగే మరికొంతమంది హీరోలు ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసి ఆయనకు నివాళులు అర్పించారు.

Next Story