'కార్తికేయ - 2 'కు 22 కోట్లు.. షూట్ కి రెడీ !

By సుభాష్  Published on  18 Jan 2020 7:39 AM GMT
కార్తికేయ - 2 కు 22 కోట్లు.. షూట్ కి రెడీ !

యంగ్ టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా 'కార్తికేయ - 2 ' సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం నుండి ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయబోతున్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రూ.22 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించబడుతుందట. మెయిన్ గా కొన్ని సీన్స్ ను విదేశాలలో చిత్రీకరించాల్సి రావడం, అలాగే సినిమాలో టాప్ - క్లాస్ విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి రావడం కారణంగా ఈ చిత్రానికి 20 కోట్లు బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ గా ఉంటాయట. ఎలాగూ 'కార్తికేయ' సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ సంపాదించుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో 'కార్తికేయ 2' తీసి... తిరిగి ఫామ్ లోకి రావాలని బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక చిత్రబృందం రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేసింది. ఇప్పటికే పుర్తయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో కొత్తగా కొన్ని మార్పులు కూడా చేశారు. అన్నట్టు ఈ సినిమాని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక నిఖిల్ లాస్ట్ సినిమా 'అర్జున్ సురవరం'తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. మరి 'కార్తికేయ 2'తో కూడా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

Next Story