గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన త్రిష
By సుభాష్ Published on 3 Oct 2020 11:39 AM GMTటీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్లో భాగంగా మొక్కులు నాటి పర్యావరణ స్పూర్తిని చాటారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన నటి త్రిష నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను ఈరోజు మొక్కలు నాటాను. మీరు కూడా ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు త్రిష. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read
డ్యాన్స్ తో రచ్చ చేసిన నటి ప్రగతి Next Story