కరెన్సీ, బంగారం వెలుగుల్లో కనకదుర్గమ్మ తల్లి..!
By Newsmeter.Network Published on 6 Oct 2019 3:16 PM GMTమనం బాగుండాలంటే అమ్మ దయ ఉండాలి. అమ్మ దయ ఉంటేనే సంతోషంగా ఉండగలం. దుర్గమ్మపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా భక్తి చూపించుకుంటారు. తెలంగాణలో రూ.3,33,33,333లతో అమ్మవారిని అలంకరించారు. అంతేకాదు..మండపాన్ని కూడా డబ్బుతోనే చేశారు. ఎక్కడైనా డబ్బులతో మండపానికి అవసరమైనవి కడతారు. ఇక్కడ మాత్రం మండపం కూడా కరెన్సీతో చేశారు. అమ్మ మీద ఎంత భక్తి ఉంటే ఇలా చేస్తారు. లక్ష్మీదేవి తోడుండగా కనక దుర్గమ్మ అమ్మవారు కరెన్సీ కట్టల్లో వెలిగిపోతున్నారు.
మరోవైపు ఏపీలోని విశాఖపట్నంలో కూడా కన్యక పరమేశ్వరి అమ్మవారిని రూ.2 కోట్లతో అలంకరించారు. అంతేకాదు..4కేజీల బంగారంతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు. కన్యకపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు తన్మయత్వం పొందుతున్నారు.
Next Story