పెట్రోల్‌ పోసుకుంటే బిర్యానీ ఫ్రీ

By సుభాష్  Published on  21 Sep 2020 12:19 PM GMT
పెట్రోల్‌ పోసుకుంటే బిర్యానీ ఫ్రీ

బిర్యానీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఓ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం. బెంగళూరుకు చెందిన ఓ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం తమ వినియోగదారులకు ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తమ పెట్రోల్‌ బంక్‌లో ఇంధనం నింపుకొనే వినియోగదారులకు బిర్యానీ ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. తమ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వినియోగదారుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ వెంకటేశ్వర ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సర్వీస్‌ స్టేషన్‌ నిర్వాహకులు తెలిపారు.

ఓల్డ్‌ మద్రాస్‌ రోడ్డులోని ఈ ఔట్‌లెట్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య కాంప్లిమెంటరీ ఫుడ్‌ ప్యాకెట్లు అందిస్తామని వెల్లడించారు. నెల రోజుల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నెల రోజుల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా వెజ్‌, నాన్‌వెజ్‌ వెరైటీలు రెండూ అందజేస్తామన్నారు.

అయితే ఫ్రీ బిర్యానీ అందించేందుకు ఈ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం కొన్ని షరతులు విధించింది. రూ.2వేలు ఆపైన ఇంధనం నింపుకొనే వారికే ఈ బిర్యానీ ఉచితంగా ఇవ్వనున్నామని తెలిపింది. రూ.250 ఆపైన ఇంధనం నింపుకొనే వారికి కూడా బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Next Story