దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.!

By Newsmeter.Network  Published on  10 Dec 2019 1:06 PM GMT
దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.!

దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం చాలా బాధాకరం అని ఆలేరు టీఆరెస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా ఆలేరులోని ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యాలు చేశారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం వలన వారి కుటుంబ సభ్యులు చాల బాధపడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా నిందితుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ను అందరు సమర్దిస్తుంటే.. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే సునీత వ్యాఖ్యలు అందరిని ఆశ్ఛర్యానికి గురి చేశాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఈ విధంగా తప్పు చేసిన నిందితులకు శిక్ష పడటాన్ని బాధాకరంగా బావిచడం సరి కాదని ప్రజలు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..!

Next Story