పాకిస్థానీగా మారనున్న డారెన్ సామీ

By Newsmeter.Network  Published on  21 Feb 2020 1:14 PM GMT
పాకిస్థానీగా మారనున్న డారెన్ సామీ

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డారెన్ డారెన్ సామీ త్వరలో పాకిస్థాన్‌ పౌరునిగా మారనున్నాడట. ఆదేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే పాకిస్థాన్ పౌరసత్వం లభించనుంది.

2004లో ఆరంగ్రేటం చేసిన ఈ ఆల్‌రౌండర్‌ విండీస్‌ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 38 టెస్టుల్లో, 126 వన్డేల్లో, 68 టీ20ల్లో విండీస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. డారెన్‌ సామీ కెప్టెన్సీలో విండీస్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. 2017 సెప్టెంబర్‌లో విండీస్‌ తరుపున చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు ఈ రైట్‌ హ్యాండ్‌ హార్డ్‌హిట్టర్‌. కాగా.. కొన్ని కారణాల వల్ల జాతీయ జట్టుకు దూరంగా ఉంటుంన్నాడు. ఈ క్రమంలో విదేశీ లీగ్‌ల్లో ఆడుతూ సత్తాచాటుతున్నాడు.

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్(పీఎస్ఎల్‌) ప్రారంభమైన్పపటికి నుంచి రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. పీఎస్ఎల్‌లో పెషావర్ జెల్మీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పీఎస్ఎల్‌ మెరుపులు మెరిపిస్తూ అక్కడి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఎంతలా అంటే.. సామి తమ దేశం తరుపున ఆడాలని కోరుకునే ఫ్యాన్స్‌కు కొదవేలేదు.

ఇదిలా ఉండగా.. అతనికి గౌర‌వ పౌర‌సత్వం ఇవ్వాల‌ని ఆ దేశ ప్రెసిడెంట్‌కు ద‌ర‌ఖాస్తు అందింది. పీఎస్ఎల్ జ‌ట్టు పెషావ‌ర్ జ‌ల్మీ అధిప‌తి జావిద్ ఆఫ్రిది తాజాగా స్యామీ ద‌ర‌ఖాస్తును పరిశీలనకు పంపించాడు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే త్వ‌రలోనే పాకిస్థాన్ పౌరునిగా స్యామీకి గుర్తింపు రానుంద‌ని సమాచారం. పాక్‌లో అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు నిర్వ‌హించ‌డంలో స్యామీ ఎంత‌గానో స‌హ‌క‌రించాడట. మ‌రోవైపు స్యామీ పౌర‌స‌త్వ ద‌ర‌ఖాస్తును ప్రెసిడెంట్‌కు పంపించామ‌ని జావిద్ ధ్రువీక‌రించాడు. ఓ వైపు సామీ.. పాక్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తుంటే.. మరో వైపు.. ఆ దేశ క్రికెటర్లు మాత్రం విదేశాల్లో ఆడేందుకు అక్కడి పౌరసత్వం కోసం వెంపర్లాడుతున్నారు.

Next Story