తిరుపతిలో దారుణ హత్య
By సుభాష్ Published on 21 Dec 2019 9:47 PM IST
తిరుమలలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. లీలామహల్ దగ్గర బెల్టు మురళీ అనే రౌడీషీటర్ను దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలో మొత్తం 8 మంది దుండగులు పాల్గొన్నట్లు స్థానికులు గుర్తించారు. అందరూ చూస్తుండగానే ప్రత్యర్థులు రౌడీషీటర్ను దారుణంగా నరికి చంపడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కాగా, హత్యకు గురైన వ్యక్తిపై తిరుమల పోలీసుస్టేషన్లో ఎన్నో కేసులున్నట్లు తెలుస్తోంది. ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడని సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Next Story