ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

By రాణి  Published on  27 Dec 2019 9:07 AM GMT
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన ఏపీ కేబినెట్ భేటీ సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సచివాలయం నుంచి మంత్రులు బయటికొచ్చారు..కానీ ఏ ఒక్క మంత్రి మీడియాతో మాట్లాడేందుకు సహకరించలేదు. కాగా..అమరావతిలో భూ దందాపై కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ చేయించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి చర్చించిన విషయాలపై మంత్రి పేర్ని నాని వివరణ ఇవ్వనున్నారు.

Next Story