'నిశ్శబ్దం'గా మర్డర్ చేసేది అనుష్కనేనట !

By రాణి  Published on  17 Dec 2019 10:07 AM GMT
నిశ్శబ్దంగా మర్డర్ చేసేది అనుష్కనేనట !

అనుష్క కీలక పాత్రలో కొత్త డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ 'నిశ్శబ్దం'. జనవరి 31న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కొన్ని సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ మర్డర్ చుట్టూ తిరుగుతుందట. ప్రధానంగా సినిమాలో మర్డర్ చేసింది ఎవరు అనే కోణంలోనే చాలా భాగం నడుస్తోంది. అయితే తాజాగా అందిన సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మర్డర్ చేసేది అనుష్కనేనట. ఈ విషయం ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో రివీల్ అవుతుందని.. మొత్తానికి మూవీలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్, మరియు అనుష్క, మాధవన్ ల మధ్య రిలేషన్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ తో పాటు హారర్ ఎఫెక్ట్స్ కూడా టీజర్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. టీజర్ సినిమా పై అంచనాలను బాగా పెంచింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇక ఈ చిత్రంలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. అలాగే మాధవన్ సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 'భాగమతి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ అందుకున్న అనుష్క...ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. ప్రముఖ రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Next Story