సైరా సినిమా చూసి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏమన్నారంటే?
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Oct 2019 7:40 AM GMTనిన్నమెగాస్టార్ చిరంజీవి ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ...బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ.. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటస్ఫూర్తితో.. రూపొందించిన 'సైరా' చిత్రం బాగుంది.
నటులు చిరంజీవి, అమితాబ్ బచ్చన్, దర్శకుడు సురేందర్ రెడ్డికి అభినందనలు. నిర్మాత రామ్ చరణ్ తేజ్ కు ప్రత్యేక అభినందనలు. ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం 'సైరా'. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణా దాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు అన్నారు.