రేపు సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

By సుభాష్  Published on  21 Sep 2020 11:25 AM GMT
రేపు సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ పోర్టల్‌ రూపకల్పనకు సమగ్ర సమాచారంతో రావాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దేశంలో తొలిసారిగా విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ధరణి పోర్టల్‌ రూపకల్పన జరగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.



Next Story