కూకట్‌పల్లి ఎమ్మెల్యే త‌న‌యుడి ఇంటిపై ఐటీ దాడులు

By Medi Samrat  Published on  20 Nov 2019 2:39 PM GMT
కూకట్‌పల్లి ఎమ్మెల్యే త‌న‌యుడి ఇంటిపై ఐటీ దాడులు

టీఆర్ఎస్ నేత‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు త‌న‌యుడి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఎమ్మెల్యే కుమారుడు సందీప్ రావ్ డైరెక్టరుగా కొనసాగుతున్న ప్రణీత్ గ్రూప్ కంపెనీలో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. ప్రణీత్ గ్రూప్ సంస్థ కార్యాలయాలతో పాటు ఎండీ నరేందర్, మరో ఐదు మంది డైరెక్టర్ల ఇళ్ళల్లో ఏక‌కాలంలో సోదాలు జ‌రుగుతున్నాయి. ఈ విష‌య‌మై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story