ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. కొత్తగా 67 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 5 May 2020 11:49 AM ISTఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 67 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 34 మంది మృతి చెందారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 589 మంది డిశ్చార్జి కాగా.. 1094 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదు అయిన కేసుల్లో కర్నూల్లో అత్యధికంగా 25 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా కర్నూల్ జిల్లాలో 516, గుంటూరు 351, కృష్ణా 286 లలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.
Next Story