ఏపీలో కరోనా మరణమృదంగం.. ఒక్క రోజే 97 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 8 Aug 2020 6:29 PM ISTఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 10వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 62,123 శాంపిల్స్ను పరీక్షించగా.. 10,080 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,17,040కి చేరింది.
కొవిడ్ వల్ల గుంటూరులో పద్నాలుగు మంది, అనంతపూర్లో పదకొండు మంది, కర్నూలులో పది మంది, పశ్చిమగోదావరిలో పది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణలో నలుగురు, కడపలో ఇద్దరు చొప్పున మొత్తం 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1939 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 1,29,615 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 85,486 మంది చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 976,
చిత్తూరులో 963,
ఈస్ట్ గోదావరిలో 1310,
గుంటూరులో 610,
కడపలో 525,
కృష్ణలో 391,
కర్నూలులో 1353,
నెల్లూరులో 878,
ప్రకాశంలో 512,
శ్రీకాకుంలో 442,
విశాఖపట్నంలో 998,
విజయనగరంలో 450,
పశ్చిమ గోదావరిలో 681 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.